Site icon PRASHNA AYUDHAM

ఛలో గాంధీ భవన్…ఉద్యమంలో అరెస్టులు

IMG 20250731 WA0031

ఛలో గాంధీ భవన్ ఉద్యమంలో అరెస్టులు

గిరిజన విద్యార్థి సంఘం నేతలు వినోద్ నాయక్, గణేష్ నాయక్ అరెస్టు

బంజర/లంబాడి వర్గాన్ని తక్కువ చేసిన ప్రభుత్వంపై ఆగ్రహం

రాష్ట్రంలో 45 లక్షల లంబాడి జనాభా ఉన్నప్పటికీ మంత్రి పదవి రాదన్న ఆవేదన

రెవెన్యూ గ్రామాలుగా గుర్తించనందుకు గత ప్రభుత్వాలపై విమర్శలు

అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు, నిరసన కొనసాగింపు

హైదరాబాద్, జూలై 31:

“ఛలో గాంధీ భవన్” కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన విద్యార్థి సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చౌహాన్ వినోద్ నాయక్, సంఘ నేత సభావత్ గణేష్ నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ భవన్ వద్ద ముట్టడికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

వారు మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల లంబాడి ప్రజలు ఉన్నా, ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం తీవ్ర నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. ఇది మా బంజర సమాజ మనోభావాలకు ఘాటు. గ్రామ పంచాయతీలు ఏర్పడినా రెవెన్యూ గ్రామాలుగా గుర్తించకపోవడం గత ప్రభుత్వాల తీరును బట్టబయలు చేస్తుంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మా లంబాడి ముద్దుబిడ్డలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన బాధ్యత ఉందని, ఆలస్యం చేస్తే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అరెస్టులు చేసినా మా పోరాటం ఆగదని గిరిజన విద్యార్థి సంఘం స్పష్టం చేసింది.

Exit mobile version