Headlines
-
“ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై చర్చ: గజ్వేల్ మహాసభలో కీలక ప్రకటన”
-
“జనవరి 4, 5 రాష్ట్ర మహాసభలకు ప్రతి కార్మికుడు హాజరు కావాలి”
-
“విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలి: చంద్రారెడ్డి”
-
“కార్మిక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు కొనసాగిస్తాం”
-
“గజ్వేల్ మహాసభలో కొత్త కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక”
సిద్దిపేటలో జనవరి 4, 5 జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
టీజీఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు చంద్రారెడ్డి
గజ్వేల్ నవంబర్ 24 ప్రశ్న ఆయుధం :
యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు గజ్వేల్ డివిజన్ మహాసభ గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు డప్పు పర్షరాములు అధ్యక్షతన షాదిఖాన ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా టీజీ ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు చంద్ర రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, సిఐటియు ఉపాధ్యక్షులు బండ్ల స్వామి హాజరు అయ్యారు. అనంతరం డివిజన్ మహాసభలో టీజీ ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని ఏళ్ల తరబడి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు అందరిని కన్వెన్షన్ చేయాలని, విద్యార్వతలను బట్టి ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. భవిష్యత్తులో కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కరించేంత వరకు కార్మికులను చైతన్యం చేసి ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్మికుల సమస్యల పైన చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రతి కార్మికుడికి న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరియు జనవరి లో రాష్ట్ర మహాసభలు 4, 5 తేదీ లలో జరగబోతున్నాయి దానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కదిలి రావాలని కోరారు. ఈ మహాసభకు టీజీ యు ఈ ఈ యు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గుంటిపల్లి సధాకర్ , టీజీ ఎస్పీడీసీఎల్ సహాయ కార్యదర్శి రామగౌని రవికుమార్ గౌడ్, సిఐటియు ఉపాధ్యక్షులు బండ్ల స్వామి , హాజరు కావడం జరిగింది. అనంతరం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య
అధ్యక్షులు డప్పు పర్షరాములు
ప్రధాన కార్యదర్శి సిరినేని భూపతి రాజు, ఉపాధ్యక్షులు ఎ.కవిత, బండ్ల శ్రీనివాస్, కుంట కిషన్, టి.మురళి,రాజేందర్ రెడ్డి,నజీర్,కార్యదర్శి వర్గ సభ్యులు వి చంద్రారెడ్డి, ఏ చంద్రం, ఎం ప్రవీణ్, ఎ రమేష్, పి ఆంజనేయులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ రెడ్డి,వి సతీష్, జి రాజు, జై యాదయ్య, జె శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్
వెంకటేష్, సోషల్ మీడియా కన్వీనర్ దూలం యాదగిరి గౌడ్ వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యుత్ ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు.