అశోక విజయదశమి ధమ్మ చక్ర పరివర్తన దినం.
విజయదశమి బౌద్ధుల పవిత్ర పండుగ…. అంబేద్కర్ రిస్ట్ సామాజిక ఉద్యమ నాయకులు, ఈటే రాజేశ్వరరావు…
స్థానిక స్వయం గౌరవ ఉద్యమ వేదిక కార్యాలయం నందు అశోక విజయదశమి బౌద్ధుల పవిత్ర పండుగ అనే అంశంపై సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్ ఉద్దేశించి అంబేద్కర్ రిస్ట్, సామాజిక ఉద్యమ నాయకులు ఈటె రాజేశ్వరరావు, ప్రముఖ హేతువాది డాక్టర్ బాను ప్రసాద్ లు మాట్లాడుతూ….అశోకవిజయ
దశమి కళింగ యుద్ధంలో అశోక చక్రవర్తి విజయం సాధించిన పదవ రోజు వరకు జరుపుకుంటారని, కాబట్టి దీనిని అశోక విజయదశమి అని పిలుస్తారని, ఈ రోజున, అశోక చక్రవర్తి బౌద్ధమతంలోకి దీక్ష తీసుకున్నాడని,కళింగ యుద్ధం తర్వాత అశోకుడు హింసా మార్గాన్ని విడిచిపెట్టి బౌద్ధమతాన్ని అవలంబిస్తున్నట్లు ప్రకటించాడన్నది చారిత్రక సత్యం అని,బౌద్ధం స్వీకరించాక బౌద్ధ ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్లాడని. తథాగత్ గౌతమ బుద్ధుని జ్ఞాపకార్థం వేలాది స్థూపాలు, శాసనాలు మరియు ధమ్మ స్తంభాలు నిర్మించబడ్డాయని, అశోక చక్రవర్తి యొక్క ఈ మతపరమైన మార్పుతో సంతోషంగా ఉన్న దేశ ప్రజలు ఆ స్మారక చిహ్నాలన్నింటినీ అలంకరించారని, మరియు దీపావళిని జరుపుకున్నారని. ఈ కార్యక్రమం 10 రోజుల పాటు చాలా ఆనందంగా కొనసాగిందని, పదవ రోజున మహారాజు, రాజ కుటుంబంతో కలిసి పూజ్య భంటే మొగ్గిలిపుట్ట తిష్య నుండి ధమ్మ దీక్షను స్వీకరించారని అన్నారు. ధర్మ దీక్షానంతరం, మహారాజు ఈ రోజు నుండి నేను గ్రంధాల ద్వారా కాకుండా శాంతి మరియు అహింస ద్వారా కేవలం మానవుల హృదయాలను గెలుచుకుంటానని ప్రతిజ్ఞ చేసాడని. అందుకే బౌద్ధం ప్రపంచం మొత్తం అశోక్ విజయ దశమిగా జరుపుకుంటుందని అన్నారు.కానీ కొంతమంది దీనికి వక్రీకరించి వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం సంబంధం లేని వాదులను తీసుకొచ్చి బహుజనుల పండుగ ను కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేశారని అన్నారు. ఈనెల 31న భద్రాచల పట్టణంలో జరిగే నరకాసుర వర్ధంతి కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, పెరియార్, భావజాలం కలిగిన ప్రతి ఒక్కరు నరకాసుర వర్ధంతి కార్యక్రమాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అలవాల రాజా పెరియార్, కొమ్మగిరి వెంకటేశ్వర్లు, కోట ప్రభాకర్, ఏ వి రావు, కొవ్వల రవి, యసం సిద్దార్థ్ ఫూలే తదితరులు పాల్గొన్నారు.