కార్పొరేట్ కళాశాలలపై మాత్రమే కాదు గురుకుల కళశాలలపై కూడా కరుణ చూపండి…..అశ్వంత్ కుమార్
ప్రశ్న ఆయుధం జూన్ 17: కూకట్పల్లి ప్రతినిధి
నేరెళ్ల శారదా మీరు చూపిస్తున్న విద్యార్థులపై శ్రద్ధకి
మా ధన్యవాదములు.
అదేవిధంగా కార్పొరేట్ కళాశాల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు గురుకుల పాఠశాల మరియు కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు కూడా న్యాయం చేయండి. అదే విధంగా గురుకుల కళాశాలలో నీరు మరియు మరుగుదొడ్లు వసతి,తినే ఆహారం కూడా సరిగా లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.అదే విధంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతు, విద్య వ్యవస్థను ఆగం చేస్తున్న అంశాలపై కూడా దృష్టి సారించాలని కోరుతున్నాము.ప్రతి విద్యార్ధికి నిత్యావసర వస్తువులతో సహా అన్ని వసతులు కల్పించి వారికి సహకరించాలని బిఆర్ఎస్వి స్టేట్ జనరల్ సెక్రటరీ అశ్వంత్ కుమార్ డిమాండ్ చేసారు.