ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 18 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అశ్వాపురం తహశీల్దార్ బి స్వర్ణ కి వినతి పత్రం అందజేశారు.అశ్వాపురం మండల పరిధిలోని ఆదివాసి గ్రామాల ప్రజలకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలి మౌలిక సదుపాయాలు కల్పించాలనీ కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అశ్వాపురం తహశీల్దార్ బి స్వర్ణకి, ఎండిఓ కార్యాలయ సూపర్డెంట్ టీవీ ఆర్కే పిచ్చేశ్వరరావుకి వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అశ్వాపురం మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామాలు కుమ్మరి గుంపు,కొత్త గుంపు, రాంనగర్, రాయన్నపేట, మనుబోతుల గూడెం, మావిళ్ళవాయి, మొండికుంట సమీప గ్రామాలలో నివసిస్తున్న అనేకమంది ఆదివాసీలు మరియు గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు లేని కారణంగా ఏదైనా ప్రమాదం లేదా అనారోగ్యం పాలైన గిరిజనులు చాలా మెరుగైన వైద్యం చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ కార్డు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితనీ దయచేసి మండల పరిధిలోని గ్రామాల గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలని కోరారు . అదేవిధంగా ఫిబ్రవరి నెలలోనే భానుడి ప్రతాపం చూపిస్తున్న నేపథ్యంలో నిండు వేసవిలో త్రాగునీటి సమస్యను కూడా ఎదుర్కోబోతున్నారన్నారు. మిషన్ భగీరథ పక్కనే ఉండి కూడా కుమ్మరి గుంపు, రాంనగర్ ఆదివాసి ప్రజలకు తాగునీటి అందుబాటు లేకపోవడం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదివాసి గిరిజన గ్రామాలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని మౌలిక సదుపాయాలైన రోడ్లు,విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు అనుబంధ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు పెద్దగోని ఆదిలక్ష్మి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అశ్వాపురం మండల నాయకులు పావురాల లాలయ్య, సామాజిక కార్యకర్త కుంజా నందు తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం మండలం ఆదివాసి గ్రామాల ప్రజలకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలి
by Naddi Sai
Published On: February 18, 2025 6:13 pm
