17వ అంతస్తు నుంచి దూకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య.

*17వ అంతస్తు నుంచి దూకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య.*

*ప్రశ్న ఆయుధం, జూన్ 26, శేరిలింగంపల్లి,ప్రతినిధి*

బిల్లింగ్ పైనుంచి దూకి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని ఓ విద్యాసంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన నిఖిల్ మదన్ (37) కు 9 నెలల క్రితమే పెళ్లయింది. ఆయన భార్య ప్రేరణ టీవీ చూస్తుండగా తను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. కాగా మదన్ మానసిక కుంగుబాటుకు చికిత్స తీసుకుంటున్నాడు. అదే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment