*పోలీసుల పై దాడి చేసిన వ్యక్తి పై కేసు నమోదు*
*, డిసెంబర్ 26* పోలీసులపై దాడి చేసి వారి వాహనం యొక్క అద్దం పగలగొట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ ఐ అనూష తెలిపారు.వివరాల్లోకి వెళితే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండలంలోని జి ఆర్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాలు లో ఒక పెళ్లికి హాజరైనారు. బందోబస్తు గురించి ఇద్దరు కానిస్టేబుల్స్ ని అక్కడికి పంపించడం జరిగింది. ఒక వ్యక్తి తాగి గలాటా చేస్తున్నాడని పెళ్లిలో న్యూసెన్స్ చేస్తున్నాడని ఎక్కువ ఫోర్సు కావాలని ఫోన్ రాగా ఎస్సైసిబ్బంది కలిసి ఇన్నోవా వెహికల్ లో అక్కడికి వెళ్లగా అక్కడ మండల శ్రీనివాస్ తండ్రి రాములు గుమ్లపూర్ గ్రామం అనే వ్యక్తి తాగి గొడవ చేయగా అదుపులోకి తీసుకుందామని ప్రయత్నించగా పోలీస్ వారిని అడ్డగించి తిట్టి వారిని కొట్టగా ఎస్ఐ కుడి చేతికి గాయమైనది కానిస్టేబుల్ నరసింహ కి దెబ్బలు తగిలినవి.అంతటితో ఆగకుండా పోలీస్ వారి వెహికల్ అయినా ఇన్నోవా మీద బండరాయితో దాడి చేయగా ఇన్నోవా వెహికల్ వెనకాల అద్దం పగిలి డ్యామేజ్ అయినది.ఇట్టి ఫిర్యాదు మేరకు మండల శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసుల మీద దాడి చేసినందుకుగాను, వారి వెహికల్ ధ్వంసం చేసినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ ఐ అనూష తెలిపారు.