*దమ్మక్క కాలనీ గిరిజనులపై దాడుల్ని ఆపాలి.*
*కోనేరు రంగారావు సిఫారసు ప్రకారం గిరిజనులకు ఇంటి స్థలాలు కేటాయించాలి.*
*EO బహిరంగంగా సమాధానం చెప్పాలి.*
*దేవస్థానం భూములు అమ్ముకోవడానికి ఏ రైట్ ఉంది.*?
*సెయింట్ పాల్స్ స్కూల్ వారు పట్టా చేయించుకోవడానికి రెవెన్యూ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు.*?
*దేవస్థానం ఈవో ఎందుకు సంబంధిత అధికారులు కంప్లైంట్ చేయలేదు.*?
*ఇంటి స్థలం దక్కే వరకు పోరాటం.*
*CPIML మాస్ లైన్ పార్టీ భద్రాచలం*
దమ్మక్క కాలనీ సమావేశంలోCPIML మాస్ లైన్ పార్టీ డివిజన్ నాయకులు.మునిగలా శివ ప్రశాంత్,దాసరి సాయి పాల్గొని మాట్లాడుతూ
దమ్మక్క కాలనీ గిరిజనులపై రాముల వారి టెంపుల్ భూములు ఆక్రమించారని వారిని ఖాళీ చేయాలని ఈవో రమాదేవి గిరిజనులపై దాడులు నిర్వహించి మహిళా గిరిజనులపై కొట్టించి అనేక ఇబ్బందులు పెడుతున్న పోలీస్ శాఖ వారు ఎందుకు పట్టించుకోవడంలేదని వారు అన్నారు ఎట్టపాక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన అప్పటికి ఇప్పటివరకు ఎటువంటి ఎంక్వయిరీ లేకుండా కాలయాపన చేస్తున్నారని వారు అన్నారు. ఈ గిరిజనులు ఆదివాసీలు 2000 సంవత్సరం నుండి ఇక్కడ నివసిస్తున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నుండి ఇంటి పన్ను కరెంటు మీటర్లు, అనుమతులు ఇచ్చినారు. వీరికి ప్రజాప్రతినిధులుగా అవకాశాలిచ్చి వార్డు నెంబర్లుగా గెలిచినవారు కూడా ఉన్నారు.రాముల వారి టెంపుల్ భూముల్ని ఆక్రమించారని. అధికారులకు అవకాశం వచ్చినప్పుడు, అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఏదో ఒక సమస్యని సృష్టించి ఆ సమస్య పరిష్కారాంతవరకు ఇక్కడే ఉండాలని కారణంతో ఆదివాసీ గిరిజనులపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాముల వారి భూములు మొత్తం ఎంత ఉన్నవి ఎంత కబ్జాకి గురైనవి అనే విషయాన్ని ఈ ఓ రమాదేవి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. భూములు పై ఎంత ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారో కూడా బహిరంగంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రజలపైకి దాడులు చేయడానికి ఎలా వస్తున్నారో రామయ్య ఖర్చులు కూడా అలానే బహిరంగంగా చెప్పాలని ఆ బాధ్యత ఆమెపై ఉందని గుర్తు చేశారు. రాములవారి భూములు మొత్తాన్ని స్వాధీన పరుచుకున్న తర్వాత గిరిజన పైకి రావాలని ఎంతో పేరుగాంచిన ధమ్మక్క వారసులైన గిరిజనులపై దాడి చేయడం సరికాదని దాడులు చేసి బెదిరింపులకు పాల్పడితే తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుందని వారు అధికారులని హెచ్చరించారు. దమ్మక్క కాలనీ పక్కన ఉన్నటువంటి సెంటెన్స్ స్కూల్ కి ఎవరు పర్మిషన్ ఇస్తే వారు అక్కడ స్కూల్ ని నిర్మించారు సమాధానం చెప్పాలని కోరారు.
ఇప్పటికైనా నాన్ టైప్ చేతిలో ఉన్నటువంటి భూమిని తీసుకొని ప్రభుత్వ అనుమతులతో పేదవాళ్ళకి భూమిని పంచాలని కోనేటి రంగారావు సిఫారసు ప్రకారం ఆ చట్టాన్ని భద్రాచలం ఏజెన్సీలో అమలు చేయాలని వారు అన్నారు.
కార్యక్రమంలో కారం పార్వతి, సోడే నాగమణి, పెనుబల్లి రాజమ్మ, పూనం నాగేశ్వరావు, కాంతమ్మ రుక్మిణి ,దుర్గ నరసింహారావు ,మల్లయ్య చిన్న వెంకటమ్మ ,రామలక్ష్మి ,అంజలి, స్నేహ రామ్ అక్క ,రాజు తదితరులు పాల్గొన్నారు.