*ప్రభుత్వ హాస్పిటల్ లో హాజరు,ప్రైవేట్ హాస్పిటల్ లో దందా*
*డాక్టర్ చేగుండ శ్రీనివాస్ పై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు*
*స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వ మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన*
*తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాము.
*జమ్మికుంట డిసెంబర్ 28 ప్రశ్న ఆయుధం:*
ప్రభుత్వ హాస్పిటల్లో హాజరవుతూ ప్రైవేట్ హాస్పిటల్లో రోగులను తరలిస్తూ దందా చేస్తున్నాడని నేపంతో డాక్టర్ చేగుంట శ్రీనివాస్ పై ప్రభుత్వం చర్యలకు ఆదేశించిందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు చెల్పూరి రాములు తెలిపారు శనివారం రోజున జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు అందని సర్కారి వైద్యం ప్రశ్నించినందుకు రాములు పై దురుసు ప్రవర్తన చేసి నానా బూతులు అన్నాడని డాక్టర్ చెగొండ శ్రీనివాస్ పై కరీంనగర్ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ చేగొండ శ్రీనివాస్ డిప్టేషన్ రద్దు చేశామని లెటర్ ద్వారా తెలియజేశారని డిప్టేషన్ రద్దు చెయ్యటమే కాదు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కి, ఫిర్యాదుచేసిన వెంటనే స్పందించిన (సీఎంఓ )సీఎం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెంటనే హుజురాబాద్ ప్రాంతీయ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ చెగొండ శ్రీనివాస్ తన డ్యూటీ సమయంలో వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో హాజరు వేసుకున్న తర్వాత డబ్బు సంపాదన ద్వేయంగా పేద ప్రజల రోగుల ఆరోగ్య సమస్యలు పట్టించుకోకుండా తన డ్యూటీని వదిలిపెట్టి వారి సొంత హాస్పటల్ అయినటువంటి జమ్మికుంట లోని వరుణ్ సాయి ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో ఓపి చూస్తున్నారని.