Site icon PRASHNA AYUDHAM

బాధితులను పరామర్శించిన ఆవుల రాజిరెడ్డి

IMG 20250102 WA0001

నాణ్య‌మైన చికిత్స అందించాల‌ని సూచ‌న 

శివ్వంపేట  జనవరి 2  ప్రశ్న ఆయుధం న్యూస్ : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం,చిన్న గొట్టిముక్కుల గ్రామ సమీపంలో టాటా ఏస్ ఆటో అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో చిన్న గొట్టిముక్కుల గ్రామస్తులు గాయపడిన విషయం తెలుసుకొని మండల కేంద్రమైన శివ్వంపేట  లో గల శ్రీ సాయి నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్న బాధితులను నర్సాపూర్ తాలూకా ఇన్చార్జ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆవుల రాజి రెడ్డి పరామర్శించారు.అధైర్యపడవద్దని అండగా మేముంటానని భరోసా కల్పించారు. నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆయ‌న వెంట‌ శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, ఫ్యాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసిలు లక్ష్మీకాంతం,కమలాపూల్ సింగ్,వారాల గణేష్, ఈసారపు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version