Site icon PRASHNA AYUDHAM

స్వయం సహాయక సంఘాలకు అవగాహన సదస్సు సాయి తేజ రెడ్డి

IMG 20250425 WA0215

ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 25 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
స్వయం సహాయక సంఘాల సభ్యులు స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు కలిగి,ఆర్థిక అవగాహనతో ముందుకు సాగాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ సాయి తేజ రెడ్డి అన్నారు.
ఈ రోజు అస్పిరేషనల్ బ్లాక్ అయిన గుండాల మండలం కాచనపల్లి లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఆర్థిక ప్రణాళిక, పొదుపు,వివిధ రకాల పెట్టుబడి సాధనాలు, బ్యాంక్ లావాదేవీలు,బ్యాంకింగ్ ఓంబుడ్స్ మెన్,ఆన్లైన్ మోసాల నుండి రక్షణ,స్వయం ఉపాధి పథకాల సద్వినియోగం తదితర అంశాలపై అవగాహన
కలిగించారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి,ఎస్.బి.ఐ- కాచనపల్లి మేనేజర్ వేణు, ఎ.పి.ఏం.కోటేశ్వర రావు,సి.సి, మరియు సి.ఎఫ్.ఎల్ కౌన్సిలర్లు నాగేశ్వర రావు,జగ్య,మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Exit mobile version