*డ్రగ్స్ పై అవగాహన సదస్సు*
*నేషనల్ లీగల్ సర్వీసెస్*
*జమ్మికుంట జూన్ 26 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంట మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సమావేశంలో అడ్వకేట్ భాను కిరణ్ మాట్లాడుతూ పిల్లలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను క్లుప్తంగా వివరించారు పిల్లలు తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పిల్లలపై ఉపాధ్యాయుల దృష్టి ఉండాలని పిల్లలు సక్రమమైన మార్గంలో నడవడానికి సూచించాలని పిల్లలకు డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనారోగ్య సమస్యలను వివరించి వాటికి బానిసలు అయినట్లయితే జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పానల్ అడ్వకేట్ భాను కిరణ్ పి ఎల్ వి గాజుల రవి ప్రధానోపాధ్యాయులు సదానందం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు