ఓటరు జబితాపై BL0 లకు అవగాహన
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ (ప్రశ్నాయుదం)10/7/25
దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు దోమకొండ మరియు బీబీపేట్ రెండు మండలాల BLO లకు ఓటరు జాబితా పై అవగాహన మరియు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇట్టి ట్రైనింగ్ కార్యక్రమాన్ని విక్టర్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సందర్శించి ఫారం6 చేర్పులు, ఫారం7 తొలగింపులు ,ఫారం 8 మార్పులు పై అవగాహన కల్పించి, ఎప్పటికప్పుడు BLO రిజిస్టర్ను అప్డేట్ చేయాలని సూచించారు మరియు ఇట్టి ట్రైనింగ్ ప్రోగ్రాంకు రాజంపేట నయబ్ తహసీల్దార్ సంతోష ట్రైనర్ గా వ్యవహరించారు,
కార్యక్రమం లో దోమకొండ తహసీల్దార్ జి సుధాకర్, నాయబ్ తహసీల్దార్ N. రేఖ మరియు దోమకొండ, బీబీపేట మండల BLO లు పాల్గొన్నారు.