Site icon PRASHNA AYUDHAM

పోతిరెడ్డిపల్లిలో మాదకద్రవ్యాలపై అవగాహన

IMG 20250624 202056

Oplus_0

సంగారెడ్డి, జూన్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): గంజాయి, మత్తు పదార్ధాల వినియోగంతో యువత జీవితాలు చిన్నా భినం చేసుకోవద్దని, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని సంగారెడ్డి రూరల్ ఎస్ఐ రవీందర్ తెలిపారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దిన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి నేతృత్వంలో పీపీఎల్ క్రికెట్ మైదానంలో యువతకు మాదకద్రవ్యాలపై అవగహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. యువకులతో పోలీసులు ఫ్రెండ్లీ క్రికెట్ ఆడారు. యువత మదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పొన్న రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

Exit mobile version