డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన..

*డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన..*

*జనగామ జిల్లా:*

*పాలకుర్తి మండలకేంద్రంలోని యాంటీ డ్రగ్ వారోత్సవాలలో భాగంగా రాజీవ్ చౌరస్తాలో వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు స్కూల్ విద్యార్థులతో ర్యాలీ చేసి వారిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.* ఈ ప్రోగ్రామ్ లో సీఐ  జానకిరామ్ రెడ్డి,ఎస్సై దూలం పవన్ కుమార్ , లింగారెడ్డి విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించినారు.ఈ సందర్భంగా సిఐ  జానకిరామ్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ వాడటం వల్ల కలిగే అనర్ధాలను వివరించడంతోపాటు పిల్లలందరినీ యాంట్రీ డ్రగ్ సోల్జర్ గా ఎన్రోల్ చేయించడం జరిగిందని,ప్రతి ఒక్కరూ డ్రగ్స్ గురించి అవగాహన కలిగించుకోవడంతోపాటు ఇతరులు కూడా దానికి బానిస కాకుండా వారికి కూడా అవగాహన కలిగించాలని,ఇట్టి డ్రగ్స్ గురించి తెలిసిన,సరఫరా చేసిన, అమ్మినట్లు తెలిసిన ఇట్టి సమాచారాన్ని 1908 నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని తమ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని,పిల్లలందరితో యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఎన్రోల్ కావడం కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సోల్జర్ గా నమోదు చేపించుకున్నామని తెలిపారు.ఈ సందర్భంగా డ్రగ్స్ గురించి ఇతరులకు అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేసినారు.

Join WhatsApp

Join Now

Leave a Comment