నాగారంలో స్వచ్ఛతా హీ సేవా సంబరాలు: పరిశుభ్రతపై పట్టణ ప్రజలకు అవగాహన*

*నాగారంలో స్వచ్ఛతా హీ సేవా సంబరాలు: పరిశుభ్రతపై పట్టణ ప్రజలకు అవగాహన*

 

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 17

 

కేంద్ర ప్రభుత్వ ‘స్వచ్ఛతా హీ సేవా’ మరియు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నాగారం పురపాలక సంఘం ప్రత్యేక కార్యక్రమాలతో సందడి చేసింది. కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు పట్టణ ప్రజల్లో పరిశుభ్రత, ప్రజాపాలనపై చైతన్యాన్ని పెంచాయి.

కమిషనర్ భాస్కర్ రెడ్డి ముందుగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పురపాలక సిబ్బంది, విద్యార్థులు, యువతతో కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం, పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించి, పరిశుభ్రతపై ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రోడ్లు, పార్కులు, ప్రభుత్వ భవనాల పరిసరాలను శుభ్రం చేసి, నాగారానికి కొత్త రూపాన్ని ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ సంతోష్ కుమార్, మేనేజర్ సురేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ నాగేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ బి. శ్రవణ్ కుమార్తో పాటు పురపాలక సిబ్బంది, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, “పరిశుభ్రత కేవలం బాధ్యత కాదు, అది మన సంస్కృతిలో భాగం. ప్రతి పౌరుడు ఈ విషయంలో కట్టుబడి ఉంటేనే ఆరోగ్యవంతమైన, అభివృద్ధి చెందిన నాగారం సాధ్యం” అని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now