ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి జూన్
మండల పరిధిలోని అల్లిపల్లి, రెడ్యాలపాడు గ్రామాలలో సాయి భారత్ గ్యాస్ అశ్వారావుపేట ఆధ్వర్యంలో గ్యాస్ వినియోగదారులకు సేఫ్టీ క్లినిక్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వంట గ్యాస్ ఏ విధంగా వాడలో వంట గదిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. గ్యాస్ లీకేజ్ అవుతున్న సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించడం జరిగింది. ఒకవేళ గ్యాస్ లీకేజ్ అవుతున్నట్లు తెలిస్తే వెంటనే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు.. అదేవిదంగా గ్యాస్ ఎక్కువ రోజులు రావాలి అంటే దానిని సంబందించిన చిట్కాలను మహిళలకు వివరించారు. ఇప్పటివరకు ఈ కేవైసీ చేయించుకొని వారు త్వరగా గ్యాస్ ఆఫీస్ వద్దకు వచ్చి చేయించుకోవాలని లేదంటే బీపీసీఎల్ సంస్థ ఆదేశాల మేరకు గ్యాస్ సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్యాస్ వినియోదారులు ఫోన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోని డెలివరీ బాయ్స్ కి ఓటిపి చెప్పి సహకరించాలని కోరారు.