*మాదకద్రవ్యలపై అవగాహన సదస్సు*
మహబూబాబాద్: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ G. అంజన్ రావు ఆదేశాలు అలాగే మహబూబాబాద్ DPEO కిరణ్ ఆదేశాల మేరకు గూడూరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు అరబిందో పాఠశాలలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలపై, వాటి వాడకం వల్ల జరిగే నష్టాలపై అలాగే జరిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగింది మరియు విద్యార్థులచే మాదకద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞను చేయించడం జరిగింది అని గూడూరు ఎక్సైజ్ CI N. బిక్షపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎక్సైజ్ సీఐ ఎన్ బిక్షపతి, గూడూరు ఎక్సైజ్ ఎస్సై ఎస్ రాజేశ్వరి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు టి శ్రీధర్ సింగ్, సిహెచ్ చిట్టిబాబు, జే.గీత, జి అనురాధ, జి సతీష్, ఎస్ కృష్ణ, జె మహేందర్, , సిహెచ్ శ్రీనివాస్, మరియు అరబిందో పాఠశాల ప్రిన్సిపల్ పింగిలి శ్రీనివాస్ మరియు గూడూరు ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పి బుచ్చయ్య హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ సుధాకర్, గద్దర్, భాగ్యలక్ష్మి, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అలాగే అరబిందో పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.