Site icon PRASHNA AYUDHAM

డ్రైనేజీలో పసికందు మృతదేహం లభ్యం.

IMG 20240818 WA0063

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులోని డ్రైనేజీలో పసికందు మృతదేహం లభించిన సంఘటన ఈరోజు మద్యహ్నం చోటు చేసుకుంది.. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం పక్కన ఉన్న డ్రైనేజీలో నవ జాత శిశువు ను పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నవ జాత శిశువు పుట్టిన తరువాత డ్రైనేజీ పాలు చేయడంతో తల్లిధండ్రుల మానవత్వానికి స్థానికులు పలువురు పలు విధాలుగా మాట్లాడు కుంటున్నారు. స్థానిక పోలిస్లకు సమాచారం అందించడంతో పసికందు మృతదేహన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు..

Exit mobile version