స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థుల పోటీ చేయాలి
– రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్,
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 28
బహుజన్ సమాజ్ పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్, విశిష్ట అతిథులు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామకృష్ణ, లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాలలో బూత్ కమిటీ, సెక్టార్ కమిటీ, మండల కమిటీ, అసెంబ్లీ కమిటీ, జిల్లా కమిటీ అన్ని కమిటీలు పూర్తిచేసుకొని కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాలలో నుంచి బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేసి గెలిచే విధంగా సూచనలు అందజేశారు. జిల్లా కమిటీలో నూతనంగా కార్యదర్శిగా పరశురాంకు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామకృష్ణ ను నియమించారు. బహుజన్ సమాజ్ పార్టీ మహనీయుల సిద్ధాంతాలపై నిర్మించబడిన పార్టీ, భారత రాజ్యాంగమే మేనిఫెస్టో కలిగిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, అన్ని రంగాలలో అభివృద్ధి, జనాభా దామాషా ప్రకారం రాజకీయ రంగాల్లో సమానంగా వాటను కల్పించే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ, బీసీ,ఎస్సీ, ఎస్టీ మత మైనార్టీ అగ్ర వర్ణాల్లో పేదలకు అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే పార్టీ బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్ , జిల్లా ఉపాధ్యక్షులు కొక్కొండ రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల సురేష్, జుక్కల్ అసెంబ్లీ అధ్యక్షులు ఈబత్వార్ రోహిదాస్, కామారెడ్డి అసెంబ్లీ ఉపాధ్యక్షులు నత్తి జీవన్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి గుండెల్ని ప్రవీణ్, ఎల్లారెడ్డి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బజార్ ప్రభాకర్ దాస్, మాచారెడ్డి మండల అధ్యక్షులు బొడ్డు సంతోష్, ఉపాధ్యక్షులు ఇల్లెందుల మనోహర్, తదితరులు పాల్గొన్నారు.