*బనకచర్ల వివాదం.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ను కలిసిన సీఎం రేవంత్*
న్యూఢిల్లీ, జూన్ 19: ఢిల్లీ కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు (గురువారం) భేటీ అయ్యారు. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్పై ఫిర్యాదు చేయనున్నారు. బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా కట్టడి చేయాలని అని కోరనున్నారు. గోదావరి – బనకచర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజుబులిటీ రిపోర్టును తక్షణమే కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడ్డుకోవడంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు నిలువరించాలని కేంద్రానికి తెలంగాణ సీఎం, మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేయనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి హాజరయ్యారు.
కాగా.. తొలి నుంచి కూడా గోదావరి – బనకచర్ల ప్రాజెక్ట్ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రికి వివరించనున్నారు.