సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాదులోని మహా న్యూస్ టీవీ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు జరిపిన దాడి దుర్మార్గం అని టీయుడబ్ల్యూజే-ఐజేయు జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కె.ఫైజల్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి ఆసిఫ్, ఉపాధ్యక్షుడు సిద్ధిక్ అహ్మద్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు వ్యతిరేకంగా ప్రసారమైన వార్తలను ఖండించుకునే హక్కు ఎవరికైనా ఉందని అంతేతప్ప పాశవికదాడులకు దిగడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. మీడియా హక్కులకు భంగం కలిగించడంతో పాటు భౌతికతలకు దిగడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. ఫోన్ టాపింగ్ విషయం కావచ్చు.. ఇతర ఏ అంశమైనా కావచ్చు ప్రజాస్వామ్యంలో చర్చించుకునే హక్కు ఉన్నదని, అలాంటప్పుడు దాడులకు దిగడం ఏ రకంగా సమర్ధనీయం కాదని అన్నారు. మీడియా కార్యాలయానికి వెళ్లి బెదిరించడం రాళ్లతో దాడులకు దిగడాన్ని ఏ ఒక్కరూ కూడా హర్షించబోరని చెప్పారు. గతంలో కూడా మీడియాపై అనేక మంది దాడులకు దిగారని, నాడు కూడా తమ సంఘం తీవ్రంగా ఖండించిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఘటన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియాపై దాడి చేయాలంటేనే భయం పుట్టే విధంగా చర్యలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటామని ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా నిలబడతామని ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామిక వాదులంతా కూడా ఈ దాడులను ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
మహా న్యూస్ కార్యాలయంపై దాడి దుర్మార్గం: టీయుడబ్ల్యూజే-ఐజేయు జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి

Oplus_0