బాన్సువాడ లో బంద్ ప్రశాంతం..
-స్వచ్ఛందంగా బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22:
బాన్సువాడలో బంద్ ప్రశాంతం కొనసాగింది. మంగళవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ సందర్భంగా ముందుగా పెద్ద హనుమాన్ మందిరం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున హనుమాన్ మందిరానికి చేరుకున్న యువకులు హిందూ సంఘాల సభ్యులు కాషా జెండాలతో భారీ ర్యాలీగా పట్టణంలోని ఆయా వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. పెద్ద హనుమాన్ మందిరం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా తాడుకోలు చౌరస్తా మీదుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా హిందూ సంఘాల సభ్యులు మాట్లాడుతూ సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలో దాడికి నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వహించామన్నారు. ఇలాంటి సంఘటన పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టిదిట్టమైన చర్యలు చేపట్టారు. పట్టణంలోని ఆయాచోట్ల గట్టి నిఘాలు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం ఆడియో కార్యాలయ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు.