పట్నం మహేందర్ రెడ్డి ని కలిసిన బండి రమేష్

మండలి చీఫ్ విప్ గా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన

బండి రమేష్ మరియు శేరి సతీష్ రెడ్డి

 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 09: కూకట్‌పల్లి ప్రతినిధి 

 

మండలి చీఫ్ విప్ గా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డి ని బుధవారం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అసెంబ్లీ ఆవరణలో కలిసి పుష్ప గుచ్చం అందజేసి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో మహేందర్ రెడ్డి పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని కార్యకర్తలకు, నాయకులకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. నాయకులు శేరి సతీష్ రెడ్డి , ప్రవీణ్ , అరవింద్ రెడ్డి , ఫణి కుమార్ , మణి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now