అల్లాపూర్ లో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాల్లో పాల్గొన్న బండి రమేష్ మరియు శేరి సతీష్ రెడ్డి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 16: కూకట్పల్లి ప్రతినిధి
బోరబండ అల్లాపూర్ లో మంగళవారం రాత్రి జరిగిన గ్యార్మీ షరీఫ్ ఉత్సవాల్లో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముస్లిం మత సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఎవరి మత ఆచారాలను వారు పాటిస్తూనే పరమత సహనాన్ని పాటించాలన్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు నాయకులు శేరి సతీష్ రెడ్డి , డివిజన్ అధ్యక్షులు మొయినుద్దీన్, జమీర్, కరీం ,అబ్దుల్లా,మస్తాన్ రెడ్డి, గౌస్, నజీర్, జహంగీర్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,సుంకన్న, ఫణీంద్ర కుమార్, శివ చౌదరి మరియు ముస్లిం యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు