దివంగత కాంగ్రెస్ నాయకుడు పాండు ముదిరాజ్ పదవ వర్ధంతి లో పాల్గొన్న బండి రమేష్
ప్రశ్న ఆయుధం జూన్ 21: కూకట్పల్లి ప్రతినిధి
తెలంగాణ ప్రగతి సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దివంగత కాంగ్రెస్ నాయకుడు పాండు ముదిరాజ్ పదవ వర్ధంతి సందర్భంగా ఫతేనగర్ హలో నీ భగత్ సింగ్ పార్కులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కష్టపడి చదువుకోవాలని జీవితంలో పైకి ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, సూరజ్ తివారి, కే రాజు, కే రమేష్, నార్సింగ్ రావు, కిట్టు, మధు, ప్రకాష్ ముదిరాజ్, అస్లాం, శివ చౌదరి, రమణ తదితరులు పాల్గొన్నారు.