Site icon PRASHNA AYUDHAM

దివంగత కాంగ్రెస్ నాయకుడు పాండు ముదిరాజ్ పదవ వర్ధంతి లో పాల్గొన్న బండి రమేష్ 

IMG 20250621 201931

దివంగత కాంగ్రెస్ నాయకుడు పాండు ముదిరాజ్ పదవ వర్ధంతి లో పాల్గొన్న బండి రమేష్

ప్రశ్న ఆయుధం జూన్ 21: కూకట్‌పల్లి ప్రతినిధి

తెలంగాణ ప్రగతి సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దివంగత కాంగ్రెస్ నాయకుడు పాండు ముదిరాజ్ పదవ వర్ధంతి సందర్భంగా ఫతేనగర్ హలో నీ భగత్ సింగ్ పార్కులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కష్టపడి చదువుకోవాలని జీవితంలో పైకి ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, సూరజ్ తివారి, కే రాజు, కే రమేష్, నార్సింగ్ రావు, కిట్టు, మధు, ప్రకాష్ ముదిరాజ్, అస్లాం, శివ చౌదరి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version