Site icon PRASHNA AYUDHAM

పవిత్ర జలస్నానం, దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యం..

IMG 20251022 WA0022

పవిత్ర జలస్నానం, దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యం..

మహిమాన్వితమైన కార్తీకమాసం ప్రారంభం

దీపారాధన అత్యంత శ్రేష్ఠమైనది – భక్తిరత్న రామకోటి రామరాజు

కార్తీకమాసం బుధవారం నుండి ప్రారంభం

పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసమని పేర్కొనడం

పూజలు, వ్రతాలు, దీపారాధనలు భక్తి పారవశ్యంతో సాగనున్నవి

“కార్తీకమాసానికి సమానమైన మాసం లేదు” – రామకోటి రామరాజు

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22గజ్వెల్

కార్తీకమాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తి భావనతో నిండిన ఈ నెలను మహిమాన్వితమైన మాసంగా అభివర్ణించారు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు.

బుధవారం మాట్లాడిన ఆయన, “పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ కాలంలో భక్తులు శివనామ స్మరణలో మునిగిపోతారు,” అని అన్నారు.

పురాణ కాలం నుంచే కార్తీకమాసానికి విశిష్టత ఉందని, పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వానబోజనాలు భక్తి పారవశ్యంతో జరుపుతారని చెప్పారు.

“కార్తీకమాసానికి సమానమైన మాసం లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేరు. వేదముతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు,” అని రామరాజు ఉద్ఘాటించారు.

ఈ పవిత్ర మాసంలో బ్రహ్మముహూర్తంలో పవిత్ర నదుల్లో లేదా జలంతో స్నానం చేయడం విశేష ఫలప్రదమని, మహిళలు ఉదయాన్నే లేచి దీపారాధన చేయడం శ్రేష్ఠమైన ఆచారమని చెప్పారు.

కార్తీకమాసంలో దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని రామరాజు అన్నారు.

“దీపం వెలిగించు ప్రతి క్షణం, భక్తి వెలుగులు నింపే కాలం – అదే కార్తీకమాసం,” అన్నారు రామకోటి రామరాజు.

Exit mobile version