ముంబయి లో బతుకమ్మ సంబరాలు

 

 

*ములుండ్ తెలుగు సేవా సంఘంచే బతుకమ్మ సంబురాలు*

 

ముంబైలోని తెలుగు సేవా సంఘం (టి.ఎస్.ఎస్) – మొలుండ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ప్రైవేట్ పాఠశాల హాల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం వలే ఈ సారి కూడా సామాజిక రాజకీయ ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెల్పారు. అందులో స్థానిక బీజేపీ కార్పొరేటర్ రజనీ కేని, నందకుమార్ వైతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కైలాష్ పాటిల్, శివసేన శాఖ ప్రముఖ్ దీపక్ సావంత్, వెంకటేష్ అయ్యర్, ఎం.ఎన్.ఎస్ పార్టీ నాయకులు సత్యవన్ దాల్వి, ఎన్.సి.పి ములుండ్ తాలూకా మహిళా అధ్యక్షురాలు సంగీత వజే, భరత్ వజే, తెలుగు కార్మిక నేత రమేష్ చావల్ తదితరులు పాల్గొని, మన తెలుగు ఆడపడుచులు నిర్వహిస్తున్న అద్భుతమైన తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాట ఆటల్లో మమేకమైయ్యారు. ఈ భవ్యదివ్య కార్యక్రమం తెలుగు సేవా సంఘం చైర్మన్ మల్లేష్ చిట్యాల అధీనంలో జరుగగా కార్యదర్శి బాబు బాప్రాబ్, బోయిని రాములు, నర్సయ్య కొమ్ము, బాబు చిట్యాల, బోయిని లక్ష్మణ్, భీమా దమ్మ, లక్ష్మణ్ బాప్రాబ్, బాబు మిట్టిపెల్లి, మల్లేష్ కొమ్ము, లోకేష్ బాప్రాబ్, ఆనంద్ గోవ్రి, శంకర్ యెనుగందుల శంకర్ లతోపాటు మహిళ కార్యకర్తలైన మాధవి చిట్యాల, తిరుపత బోయిని, నైనా బాప్రాప్, భవ్య బాప్రాబ్, రేణుకా చిట్యాల, సుజాత కుమార్గేర్ల, లింగంపల్లి రేణుకా తదితరులు సంబురాల్ని విజయవంతం చేశారు.

 

Join WhatsApp

Join Now