బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి
— కలెక్టర్ ఆదేశాలు
— ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు చేపట్టాలి
— శాఖలతో సమన్వయం సూచన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 22
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా, వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని, తెలంగాణ సాంస్కృతి ప్రతిబింబించేలా పండుగ వాతావరణం సృష్టించాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ లైట్లతో అలంకరించాలని, జిల్లాలో బతుకమ్మ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో బతుకమ్మ ఆడే ప్రదేశాలు, నిమజ్జనం ప్రాంతాలను శుభ్రపరిచి విద్యుత్ దీపాలు, మైకులు ఏర్పాటు చేయాలని, నిమజ్జనం వద్ద గజఈతగాలను అందుబాటులో ఉంచాలని అన్నారు.
అంగన్వాడి కేంద్రాల్లో పౌష్టికాహార మేళాలు నిర్వహించాలని, కలెక్టరేట్లో సద్దుల బతుకమ్మ వరకు ప్రతి రోజు ఒక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 30న సద్దుల బతుకమ్మ రోజు కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగులచే పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరగనున్నట్లు తెలిపారు.
బతుకమ్మ ఉత్సవాలకు జిల్లా నోడల్ అధికారిగా డీఆర్డీఓ సురేందర్ను నియమించి, అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.