Headlines in Telugu:
-
బీసీ కులాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం సమగ్ర సర్వే ముఖ్యమని నిరంజన్
-
సంగారెడ్డిలో జరిగిన బీసీ కమిషన్ బహిరంగ విచారణలో కీలక వ్యాఖ్యలు
-
ఇంటింటి సర్వే యజ్ఞంలా నిర్వహించాలి: BC కమిషన్ చైర్మన్
సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ ఉమ్మడి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బుధవారం జరిగిన బీసీ కమిషన్ బహిరంగ విచారణ ప్రశాంత వాతావరణంలో జరిగింది. బహిరంగ విచారణ ప్రశాంత వాతావరణంలో జరిగినందుకు కమిషన్ చైర్మన్ నిరంజన్ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని అభినందించారు. బీసీలు రాజకీయ ఆర్థికంగా ఎదగాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర సర్వే కు సహకరించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన మెదక్ ఉమ్మడి జిల్లా బీసీ కమిషన్ బహిరంగ విచారణ బీసీ కమిషన్ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై వచ్చే నెల 6 నుండి జరిగే ఇంటింటి సర్వే యజ్ఞంలా నిర్వహించాలని అన్నారు. వచ్చే నెల 13 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమిషన్ విచారణ జరుగుతుందని అన్నారు. వెనుకబడిన తరగతుల కమిషన్ విచారణకు అన్ని జిల్లాలు కలెక్టర్లు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. ఈ రోజు జరిగిన విచారణకు 96 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఇంటింటి సర్వేకు అందరూ సహకరించాలని తెలిపారు. కలెక్టర్లకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కమిషన్ విచారణలో ప్రజల నుండి కుల సంఘాల నుండి వచ్చిన సమస్యలను జిల్లా కలెక్టర్ సావధానంగా విన్నారని, వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ కలెక్టర్ ను అభినందించారు. ఇంటింటి సర్వే చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు. ఎమ్యూనేటర్లు చేసే ఇంటింటి సర్వే ను జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. ఇంటింటికి ఎమ్యూనేటర్లు వచ్చినపుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రాజకీయపరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే అందరూ సమగ్ర సర్వేలో ఉన్న కులం, విధ్యా అర్హతలన్నీ తెలపాలన్నారు. ఇంటింటి సర్వేకు బీసీ కుల సంఘాలు ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. సమాజంలో ఉన్న బీసీ లెక్క తేలితే రాబోయే రోజులు అన్ని మంచి రోజులే అని చైర్మన్ అన్నారు. అన్ని బీసీ కుల సంఘాలు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలలో జరిగే బీసీ కులాల బహిరంగ విచారణకు జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. చాలా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారిగా కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్లను జనాభా దామాషాపై వచ్చేనెల 13 వరకు జరుగుతుందని తెలిపారు. కొన్ని బీసీ కులాల వారి పేర్లతో అవమానిస్తున్నారని, పేర్లను మార్పు చేసే విధంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. బీసీ కులాలను కులాల పేరుతో అవమానిస్తే బీసీ అట్రాసిటీ ఆక్ట్ తీసుకువచ్చేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామమని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, ఎం. నగేష్, మహ్మద్ హామీద్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్, సంబంధిత జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.