బీసీ రిజర్వేషన్, ఎస్ సి వర్గీకరణ బిల్లు శాసనసభలో ఆమోదం చారిత్రాత్మక నిర్ణయం

ఐ ఎన్ టి యు సి బ్రాంచ్ కార్యదర్శి షేక్ అబ్దుల్ రవూఫ్

ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 23 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

బీసీ రిజర్వేషన్,ఎస్సీ వర్గీకరణ బిల్లులు తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందటం చారిత్రాత్మక నిర్ణయం అని, ఈ చారిత్రాత్మక సంఘటనతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరింత గుండెల్లో దాచుకుంటారని ఏరియా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి) మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి షేక్ అబ్దుల్ రవూఫ్ అన్నారు.ఆదివారం నాడు మణుగూరు ఏరియా కొండాపురం సి ఎస్ పి లో ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల చిత్రపటాల పాలాభిషేకం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అనంతరం కార్మికుల నుద్దేశించి ఆయన మాట్లాడారు.తెలంగాణ లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఎంతో ప్రతిష్టాత్మకమైన బీసీ రిజర్వేషన్ బిల్లు మరియు ఎస్ సి వర్గీకరణ బిల్లు తెలంగాణ అసెంబ్లీ లో ప్రవేశపెట్టి, ఆమోదింపబడి చట్టబద్ధత కల్పించినందుకు గాను రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి, పీసీసీ ప్రెసిడెంట్ ముకేష్ కుమార్ గౌడ్ కి,మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దామోదర్ రాజ నరసింహ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ,పొన్నం ప్రభాకర్ మరియు పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు గార్ల చిత్ర పటాలకు కార్మికుల సమక్షంలో పెద్దపెటున నినాదాలు ,హర్షద్వానాల మధ్య కొండాపురం సి.ఎస్.పి లో ఘనంగా నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో

కే సి హెచ్ ఫిట్ సెక్రటరీ శ్యామ్ వర్మ అధ్యక్షత వహించగా జాయింట్ సెక్రటరీ అజిత్, బ్రాంచ్ నాయకులు సదానందం, సమ్మయ్య , ఐ ఎన్ టి యు సి కార్యకర్తలు పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now