*రేపటి నుంచి హైదరాబాద్ లో అందాల పోటీలు!*
*భారత్ -పాక్ ఉద్రిక్తతలు అందాల పోటీలు వాయిదా వేస్తారా?*
*హైదరాబాద్:మే 09*
ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ రేపటి నుంచి ఈ నెల 31 వరకు జరగ నుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 109 దేశాల నుండి అందాల భామలు నగరానికి చేరుకున్నారు.
అయితే, భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నడుమ రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీలపై తీవ్ర ఉత్కంఠత మొదలైంది, మిస్ వరల్డ్ పోటీల నిర్వాహక సంస్థ తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తుంది.. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన ముద్దుగుమ్మలకు ప్రభుత్వం గట్టి కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాట్లు చేసింది..
కాగా ఇతర దేశాల నుండి మరికొంతమంది పోటీదారులు ఇంకా వచ్చే అవకాశముంది. రేపటి లోగా మొత్తం అభ్యర్థులు నగరానికి చేరుకోనున్నారు. ఇక భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు…
అథెన్నా క్రాస్బీ అమెరికా, ఎమ్మా మోరిసన్ కెనడా, వాలేరియా కాన్యావో వెని జులా వంటి ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అమెరికా, దక్షిణాఫ్రికా, వెనిజులా వంటి ప్రముఖ దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రా ల్టర్, మార్టినిక్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొనడం విశేషం.
విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామా జిక వేత్తలు, కళాకారులు, ఉద్యమకారులుగా ఉన్న పోటీదారులు తమ దేశాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక పోటీల్లో పాల్గొనే పోటీదారులు దాదాపు నెల రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక, సాంస్కృతిక, వైద్య, చేనేత, ఆవిష్కరణ కేంద్రాలను సందర్శించను న్నారు.
గత ఏడాది ముంబయిలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరగగా.. ఈ ఏడాది మే 31న హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరగనుంది. మిస్ వరల్డ్ పోటీలను వరుసగా రెండేళ్ల పాటు భారత్ లో నిర్వహించడం తొలిసారి. ఈ అరుదైన గౌరవం దేశానికి మాత్రమే కాదు.. ముఖ్యంగా తెలంగాణకు కూడా విశ్వవేదికపై విశిష్ట గుర్తింపునిస్తుంది.