భారతీయ జనతా పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ కనుక..
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని భాజపా కార్యాలయంలో జిన్నారం మండల శక్తి కేంద్ర ఇన్చార్యులు ఆపై స్థాయి నాయకుల సమావేశం మండల అధ్యక్షుడు కొత్త కాపు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఇట్టి కార్యక్రమాని లొ ముఖ్యఅతిథిగా జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లంరాజు రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ. భారతీయ జనతా పార్టీ నీ పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ప్రతి బూతులో 200 సభ్యత్వం పూర్తి చేసే ఇద్దరూ క్రియాశీల సభ్యులను చేర్చాలని తర్వాత బూత్ కమిటీలు వేసి మండల అధ్యక్షుడు ఎన్నిక వరకు కూడా నిర్విరామంగా కృషి చేయాలి భారతీయ జనతా పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ కనుక మనం అన్ని కమిటీలు పూర్తి చేసుకోవాలని జిన్నారం మండల కమిటీకి సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వంగేటి ప్రతాపరెడ్డి సీనియర్ నాయకులు కురుపల్లి నర్సింగరావు, దోమడుగు రమేష్, వంగేటీ రాజిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు మద్దూరి రాజు, వెంకటేష్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు పూడూరు సుధాకర్, కోశాధికారి వెంకటేష్ శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు.