ప్రజాసంఘాల కార్య
ఉపాధి కూలీల సమస్యలపై బీకేమ్ యూ ఆందోళనలు
వ్యవసాయ కార్మిక సంఘం(బీకెమ్ యూ)
జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు,
బొత్స మోహన్ రావు,
గరుగుబిల్లి సూరయ్య
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 8 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమాలు నడుపుతామని ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొత్స మోహనరావు గరుగుబిల్లి సూరయ్య ప్రకటనలో తెలిపారు పార్వతీపురం పటంలో గొల్ల వీధిలో ఉన్న ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన బి కే యం యు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రధానంగా సమావేశం ఉపాధి కూలీల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే విధంగా మండల స్థాయిని ఒక యూనిట్ గా తీసుకొని నేరుగా సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించే విధంగా జిల్లాలో ఉన్న బికేఎంయు కార్యకర్తలు కృషి చేయాలని సమావేశంలో తీర్మానించడం అయినదని తెలిపారు, ఈ నెల 8 9 10 తేదీల్లో మన నాయకులకు అందుబాటులో ఉన్న చెరువుల్లో చేస్తున్న ఉపాధి కూలీలు వద్దకు వెళ్లి సమస్యలపై చర్చించాలని అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు, ఇప్పటికే పాత సంవత్సరం ఉపాధి బకాయిలు కోట్ల రూపాయలో ఉన్నాయని అన్నారు, ఓ ప్రక్క ఉపాధి బిల్లులు అందక కూలీలు ఇబ్బంది పడుతుంటే రెండో ప్రక్క ఐడిఎఫ్సి బ్యాంకుల్లో ప్రూఫ్ లేకపోవడంతో బిల్లులందటo లేదు, ఇవి అవ్వాలంటే విశాఖపట్నం, విజయవాడ వెళ్లాలంటే ఉపాధి కూలీలకు తడిపి మోపుడు అవుతుందని అన్నారు, అందుకుగాను ఐడిఎఫ్సి బ్యాంకులు జిల్లా కేంద్రంలో ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి కూలీలకు సక్రంగా బిల్లు అందేటట్లు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు, ఉపాధి హామీ లో నెలకొన్న బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రతి ఉపాధి శ్రామికునికి సంవత్సరానికి 12 వేల రూపాయలు ఉపాధి భృతి ఇవ్వాలని, ఉపాధి హామీ కి రాష్ట్ర ప్రభుత్వం వాటా కేటాయించాలని, మెటీరియల్ కంపోనెంట్ 50% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, 200 రోజులు పని దినాలు కల్పించి, రోజు కూలీ 700 రూపాయలు ఇవ్వాలని,పనులు కల్పించి వలసలు ఆపాలని, సకాలంలో వేతనాలు ఇవ్వాలని, ఉపాధి హామీ ని ఇతర రంగాలకు మల్లించరాదని తదితర డిమాండ్స్ పై ఈ నెల 9,10,11 తేదీల్లో ఉపాధి హామీ పని ప్రదేశాలను జిల్లా బృందాలు ఎక్కడికక్కడ ఉపాధి కూలీలతో సమావేశం జరిపి సమస్యలు తెలుసుకొని, పరిశీలించి, ఉపాధి శ్రామికులు చెప్పిన, మరియు మీ ద్రుష్టికి వచ్చిన సమస్యలపై 12 వ తేదీన జిల్లా కలెక్టర్లకు మెమోరాండాలు సమర్పించాలని సమావేశంలో తీర్మానించడం అయినది,