*ఆపరేషన్ “దోస్తు కు ద్రోహం!*
*హైదరాబాద్:మే10*
టర్కీ దేశం ఇప్పుడు డబుల్ గేమ్ ఆడుతుంది. చేసిన సాయానికి విశ్వాసం, కృతజ్ఞత, చూపించకుండా భారత్ పై విషం కక్కుతుంది. 2023లో ఆ దేశంలో భారీ భూకంపం వచ్చినప్పుడు సాయం ప్రకటించిన తొలి దేశం మనదే..
ఆపరేషన్ దోస్త్’ పేరిట భారీగా మానవతా సాయాన్ని అందజేసింది. బాధితులకు ఆహారం, మెడిసిన్ సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను మోడీ సర్కార్ పంపింది. అప్పుడు మనం మానవత్వాన్ని చూ పిస్తే.. ఇప్పుడు భారత్పై దాడికి పాకిస్థాన్కు డ్రోన్లను పంపిస్తుంది టర్కీ.
అయితే, శుక్రవారం రాత్రి నాడు పాకిస్తాన్ భారీ స్థాయిలో భారత్పై డ్రోన్లతో దాడులు చేసింది. దాదాపు 300- 400 డ్రోన్లను ప్రయో గించగా.. వాటిని ఇండియ న్ ఆర్మీ కూల్చి వేసింది. కాగా, ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించగా.. అవన్నీ టర్కీకి చెందిన అసిస్ గార్డ్ సోనగర్’ డ్రోన్లుగా తేలింది.
ఇక, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు మొదటి నుంచి భారత్ పై విపరీతమైన ద్వేషం ఉంది. ఆ విష యాన్ని అనేక సందర్భాల్లో అతడు బహిరంగంగా తెలియజేశాడు. పహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తుంటే.. టర్కీ అధినేత మాత్రం పాక్ ప్రధానితో కలిశారు. ఆ దేశానికి మద్దతు పలికారు.
ఇక, పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని ముందుగానే ఊహించిన టర్కీ.. ఆరు సైనిక విమానా ల్లో పాక్కు ఆయుధాలను పంపించింది ఎర్డోగాన్ సర్కార్. టర్కీ సీ-130ఈ హెర్క్యూలస్ విమానం గత నెల 28వ తేదీన ఇస్లామాబాద్ లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు తెలిపాయి.
అయితే, ఇంధనం నింపు కోవడానికి తమ యుద్ధ విమానం దిగిందని అబద్దపు మాటలు చెప్పింది టర్కీ. తర్వాత ఓ యుద్ధ నౌకను కూడా కరాచీ నౌకాశ్రయానికి పంపింది. ఇప్పుడు ఆ ఆయుధాలనే భారత్పై దాయాది దేశం ప్రయోగిస్తోంది.
పహల్గామ్ దాడి తర్వాత టర్కీ, అజర్ బైజాన్ మాత్ర మే పాక్కు మద్దతిస్తూ వెల్లడించాయి. అయితే, తాజాగా, పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన మృతులకు టర్కీ సంతాపం ప్రకటించింది. దీంతో టర్కీ అధినేత డబుల్ గేమ్ పై భారత్ ఇంకా స్పందించలేదు.