Site icon PRASHNA AYUDHAM

గంజాయిని భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు తగలబెట్టారు

IMG 20241230 WA0200

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
రూ. 1.12 కోట్ల గంజాయి కాల్చివేత..449 కేజీల గంజాయి కాల్చివేత.భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 24 కేసుల్లో పట్టుకున్నటువంటి 449 కేజీల గంజాయిని సోమవారం కాల్చి వేసినట్లు ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.
గంజాయిని ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి ఏ డబ్ల్యు ఎం కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గోపాల్పేట్ తాళ్లపేట మండలంలో గంజాయిని దహనం చేశారు.
కాల్చి వేసిన గంజాయి విలువ రూ. 1.12 కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు.గంజాయిని కాల్చివేసిన సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి అభినందించారు.
గంజాయ కాల్చివేత కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ తో పాటు అసిస్టెంట్ కమిషనర్ గణేష్ భద్రాచలం సిఐ రసూల్ ఉన్నిసా బేగం ఉన్నారు.

Exit mobile version