పశువైద్య సేవలను రైతులకు మరింత చేరువుగా అందించుటకు

పశువైద్య
Headlines :
  1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 రోజుల ప్రత్యేక పశువైద్య శిబిరాలు
  2. రైతులకు పశువుల పోషణలో శాస్త్రీయ పద్ధతులపై అవగాహన
  3. 11,500 పశువులకు పశువైద్య సేవలు, మందులు, టీకాలు అందించిన కార్యక్రమం
  4. పశువైద్య శిబిరంలో భాగంగా 440 గర్భకోశ వ్యాధులకు చికిత్స

పి.వి నరసింహారావు పశువైద్యలు
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 7 భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి
విశ్వవిద్యాలయం,మామునూర్, వరంగల్ జిల్లా పశుసంవర్థకశాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి సహకారంత్ జాతీయ సేవా పథకముల్ భాగంగా 7 రోజుల ప్రత్యేక పశు వైద్య శిబిరాలు 01 నుండి 07 వరకు నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా చివరి రోజు భద్రాచలములోని పశు వైద్య శాల సీతారామచంద్రస్వామి దేవస్థానం వారి గోశాలలో పశువైద్య శిబిరం జరిగింది.ఈ ప్రత్యేక పశువైద్య శిబిరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 మండలాలని 12 గ్రామాలలో నిర్వహించడం జరిగింది.ఈ శిబిరాలలో నిష్ణాతులైన పశువైద్య కళాశాల ఆధ్యాతక బృందం, పశువైద్యాధికారులు,36 పశు వైద్య కళాశాల విద్యార్థులు పొల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో 11,500 పశువులకు వివిధ రకములైన పశువైద్య సేవలు అందించడం జరిగింది. ఇందులో భాగంగా 11,000 సాధరణ చికిత్సలు,60 శాస్త్ర చికిత్సలు, 440 గర్భకోశ వ్యాధులకు చికిత్స మరియు చూడి నిర్మారణ పరీక్షలు నిర్వహించబడింది.పశువులకు, జీవాలకు, కొళ్ళకు ఉచితంగా మందుల పంపిణీ మరియు టీకాలు ఇవ్వడం జరిగింది. రైతులకు పశువుల పోషణ లో పాటించవలసిన శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను, పెంటికోళ్ళ పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు మెళకువలపై అవగాహన కల్పించారు.ఈ శిబిరాలకు మంచి స్పందన వచ్చినట్లు ఎస్. ఎన్. ఎస్. ప్రోగ్రాం అధికారులు డా. వంశీ కృష్ణా డా,,రాజశ్రీ తెరిపారు.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం శాసన సభ్యులు తెల్ల వెంకటరావు, శ్రీశివాసరెడ్డి – అసోసియెట్ శక్తి డా. ఎం. శ్రీనివాస రెడ్డి, భూరి_కొత్తగూడ
డా,,జి. పూరంధర్, అసోసియేట్ బద్రాచలం ఏడి డా,,రాగూర్, పాలవంచ ఏడి డా,,సత్యప్రసాద్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now