*భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిస్తాం*
*సిపిఎం జమ్మికుంట మండల కార్యదర్శి శీలం అశోక్*
*జమ్మికుంట మార్చి 23 ప్రశ్న ఆయుధం*
ఆదివారం రోజున జమ్మికుంట సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మండల కార్యదర్శి శీలం అశోక్ మాట్లాడుతూ బ్రిటిష్ వలసవాద నిరంకుశ పాలన నుండి భారతదేశ ద్రస్య శృంఖలాల విముక్తికోసం పోరాడిన యోధుడు ఉరి శిక్షను సైతం ఇష్టంగా స్వీకరించినటువంటి పోరాట యోధుడు భగత్ సింగ్ అని అతి చిన్న వయస్సులో 24 సంవత్సరాల్లో ఉరి తీయబడినటువంటి వ్యక్తి భగత్ సింగ్అని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీలో బాంబు పెట్టారని అభియోగంతో అరెస్టు చేసి జైల్లో వేసినారు అయినప్పటికీ జైల్లో నుండి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వ్యక్తి భగత్ సింగ్ 1931 మార్చి 23వ తేదీన భగత్ సింగ్ తో పాటు సుగ్దేవ్ రాజ్ గురు లను కూడా బ్రిటిష్ ప్రభుత్వము రహస్యంగా ఉరి తీయబడినటు వంటి చీకటి రోజు మార్చి 23 అని బ్రిటిష్ ప్రభుత్వము వీరిని ఒకరోజు ముందే ప్రత్యేక జడ్జిని నియమించి ప్రజలు తిరగబడతారని రహస్య ప్రాంతంలో వారిని ఉరి తీయడం జరిగిందని భగత్ సింగ్ కుటుంబ సభ్యులు క్షమాభిక్ష కొరకు భగత్ సింగ్ ని కలిసి క్షమాభిక్ష కొరకు సంతకం చేయమంటే వారు పెట్టే క్షమాభిక్షతో బతుకుడు నాకిష్టం లేదని ఉరికంబాన్ని సైతం ఇష్టంగా స్వీకరించినటువంటి వ్యక్తి భగత్ సింగ్ అని కొనియాడారు వారి స్ఫూర్తితో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారి పోరాటపటిమను స్మరిస్తూ వారికి జమ్మికుంట మండల కమిటీ పక్షాన ప్రత్యేక విప్లవ జోహార్లు తెలియజేస్తున్నమన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వడ్లూరి కిషోర్ కుమార్ జక్కుల రమేష్ సతీష్ గిరవేణి రాజు సదానందం కిరణ్ రాజేష్ కుమార్ పాటు తదితరులు పాల్గొన్నారు