పీవీ కాలనీ చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ స్వామి గుండెపోటుతో మృతి

ప్రశ్న ఆయుధం న్యూస్ మే 2 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
మణుగూరు మండలం పివి కాలనీకి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కంప్యూటర్ సెంటర్ నడుపుతున్న కొర్ర భరత్ కుమార్ (54) శుక్రవారం ఉదయం గుండెపోటుతో చనిపోయారు. భరత్ స్వామి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా పీవీ కాలనీ రామాలయం కాంప్లెక్స్ ఫోటో స్టూడియో మరియు కంప్యూటర్ సెంటర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇక్కడే స్థిరపడ్డారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నూతన ఆలయాల నిర్మాణాలలో చురుకైన పాత్రను పోషించడమే కాకుండా క్రమం తప్పకుండా అయ్యప్ప మాల దారణ తరించటంతో మిత్రులతోపాటు అందరూ భరత్ స్వామి ముద్దుగా పిలుచుకుంటారు. పీవీ కాలనీ కోదండ రామాలయం శ్రీరామనవమి వేడుకలలో కూడా ఆయన పాత్ర మరువలేనిది భరత్ కు భార్య ఇరువురు సంతానం గత రెండు రోజుల క్రితం ఒంట్లో నలతగా ఉండటంతో వైద్యుని సంప్రదించారని శుక్రవారం ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అందరితో ఎంతో స్నేహభావంతో ఉండే భరత్ స్వామి మృతి వార్త కాలనీవాసులను ఎంతగానో కలచివేసింది. పలువురు రాజకీయ పార్టీ నాయకులు కార్మిక సంఘాల నాయకులు సింగరేణి కార్మికులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున భరత్ స్వామి ఇంటి వద్ద ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సింగరేణి కార్మిక సంఘాల నాయకులు ఏఐటియుసి నాయకులు వై రాంగోపాల్, రామ నరసయ్య, ఐ ఎన్ టి యు సి నాయకులు వి కృష్ణంరాజు సిల్వేరు గట్టయ్య ,సిఐటియు నాయకులు వి వెంకటరత్నం, టీవీ వి ప్రసాద్, టిబిజికేస్ నాయకులు నాగల్లి వెంకట్, హెచ్ఎంఎస్ నాయకులు కొడిపల్లి శ్రీలత, డి రమేష్, బి ఎం ఎస్ నాయకులు భూక్య కిషన్, కార్మిక నాయకులు వి ప్రభాకర్ రావు, శివాజీ తదితరులు భరత్ కుమార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేయడంతో పాటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు నాయకులు యస్ డి నా సర్ పాషా, అంగోత్ మంగీలాల్ భరత్ స్వామి చిరకాల మిత్రులు వున్నo సుదర్శన్ రావు లు మాట్లాడుతూ భరత్ స్వామి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటించడంతోపాటు మంచితనం మానవత్వం కలగలిపిన మంచి మనిషిని కోల్పోయామని వారు తమ సంతాప ప్రకటనలో తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Join WhatsApp

Join Now