తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా సీఎం మాట్లాడవద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. భారాస హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అమరరాజాను ఒప్పించేందుకు కష్టపడ్డామని చెప్పారు. రూ.9500 కోట్ల పెట్టుబడులకు ఆ సంస్థ ముందుకొచ్చిందన్నారు. రాజకీయ విభేదాలతో తెలంగాణకు నష్టం జరగకూడదని చెప్పారు. కార్నింగ్ ప్లాంట్, అమరరాజా కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనడం సీఎం మానేయాలని వ్యాఖ్యానించారు.
యూట్యూబ్ మాజీ సీఈవో మృతికి సంతాపం*
యూట్యూబ్ మాజీ సీఈవో సుశాన్ వొజ్కికి మరణవార్త చాలా బాధ కలిగించిందని కేటీఆర్ అన్నారు. అత్యంత డైనమిక్గా ఉండే వొజ్కికి ఎంతో తెలివైన వారని.. ఆమెతో పలు సందర్భాల్లో మాట్లాడటం ద్వారా చాలా నేర్చుకున్నానని తెలిపారు. వొజ్కికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.