*చెత్తను రీసైకిల్ చేసి వస్తువులను తయారు చేయడం భేష్*
*మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్*
*జమ్మికుంట జూన్ 26 ప్రశ్న ఆయుధం*
చెత్త చెత్త కాదు, చెత్తను రెడ్యూస్ చేయండి అంటూ మున్సిపల్ వాహనాలలో ప్రజలకు తెలిసేలా చెప్పడంతో పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆది గమనించి చెత్త నుండి వస్తువులను తయారు చేసి అందరిని ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి మున్సిపాలిటీ పరిధిలో 100రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులు చెత్త నుండి వస్తువులను తయారు చేసే విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ చెత్తను ప్రజలు ఆరుబయట వేయకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, కానీ నేడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చెత్తను ఏ విధంగా వాడుకోవచ్చో చేసి చూపించారన్నారు. మార్పు మన నుండి మొదలు కావాలని, ఆ మార్పు అభివృద్ధి ముందుడుగు పేర్కొన్నారు సుమారు 45 మంది విద్యార్థులు చెత్తతో వస్తువులను తయారు చేయగా మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులలో ముగ్గురికి బ్యాగులు బహూకరించగా, మిగిలిన వారికి పెన్నులను బహుకరించారు. ఈ మార్పు మనందరిలో రావాలని, చెత్తను రెడ్యూస్ రియాజ్ రీసైకిల్, చేయవచ్చని తెలిపారు పట్టణంలోని ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటికి వచ్చే వాహనాలకు అందించాలని తెలిపారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలో చెత్తను రోడ్లపై వేసిన ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసి అక్కడ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ గా ఏర్పాటు చేసి ముగ్గులు వేసి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇనస్పెక్టర్ మహేష్, సదానందం, శ్రీకాంత్ , శ్రీనివాస్, బాయ్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్ సదానందం, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.