Site icon PRASHNA AYUDHAM

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం తహసిల్దార్ నల్ల వెంకట్ రెడ్డి

IMG 20250619 WA2445

*భూ సమస్యల పరిష్కారానికే భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం* *తహసిల్దార్ నల్ల వెంకట్ రెడ్డి*

*జమ్మికుంట జూన్ 19 ప్రశ్న ఆయుధం*

రైతుల భూ సమస్యల పరిష్కారానికే అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట మండల తాహసిల్దార్ నల్ల వెంకటరెడ్డి అన్నారు మండల కేంద్రంలోని ఆబాది జమ్మికుంటలో గల రైతు వేదికలో గురువారం భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ నల్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం రూపొందించారని దీని ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామంలో రైతు సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తహసీల్దార్ నల్ల వెంకట్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు రెవెన్యూ పరిధిలోని రైతులు వారి సమస్యలపై 415 దరఖాస్తులను రెవెన్యూ అధికారులకు అందించారు. రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని దీనిపై ప్రజలకు గతంలోనే అవగాహన కల్పించడం జరిగిందని ఇప్పుడు ప్రతి రెవెన్యూ గ్రామంలో జరగబోయే భూభారతి సదస్సుకు ముందు రోజే మా సిబ్బంది ఆ గ్రామంలో ఉన్న రైతులకు అవగాహన కల్పించి వారికి అప్లికేషన్లు అందించడం జరుగుతుందని రైతు సమస్యలను అప్లికేషన్ ద్వారా సదస్సులో అందిస్తే సరిపోతుందని తహసిల్దార్ తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సదస్సులు నిర్వహించడం రైతులు సహకరించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నల్ల వెంకట్ రెడ్డి డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గడ్డం శంకర్, సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి మూగల అంజిరెడ్డి, ఏఈఓ రాంప్రసాద్, ఎంపిఎస్ఓ రమేష్, సర్వేయర్ మనోజ్ రావు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version