Site icon PRASHNA AYUDHAM

భూమాత మాడ్యూల్ అమలు చెయ్యాలి జిల్లా కలెక్టర్ వెల్లడి

IMG 20250107 WA0291

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి7 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
భూమాత మాడ్యూల్లో సమస్యలు మరియు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు పై నివేదికలు సమర్పించాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న భూమాత పోర్టల్ అమలకు ముందు మాడ్యూల్లో తలెత్తే సమస్యలు మరియు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి ఆర్డీవోలు మరియు తాసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమాత మాడ్యూల్ అమలు లో భాగంగా పోర్టల్ లో తలెత్తే సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలకు తీసుకోవలసిన చర్యలను అందరూ తాసిల్దారులు లిఖితపూర్వకంగా నిర్దేశిత పట్టిక ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. వచ్చిన సూచనలు మరియు సలహాలను ఉన్నతాధికారులకు పంపడం ద్వారా మాడ్యూల్ లో మార్పులు చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్ ఓ ఆర్ చట్టం మరియు కొత్త చట్టం పై తాసిల్దార్లకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు,మండలాల పరిధిలో ఉన్న అటవీ శాఖ భూముల వివరాలను అటవీ శాఖ గెజిటెడ్ మరియు రెవెన్యూ రికార్డులతో సరిచూసి ఏ సర్వే నెంబర్లు ఎంత అటవీ భూములు ఉన్నాయో గుర్తించాలని ఆదేశించారు. దీని ద్వారా మిగిలిన ప్రభుత్వ భూములను ఎయిర్ పోర్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు వంటి తదితర అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చు అని కలెక్టర్ తెలిపారు.

Exit mobile version