*ఏ ఐ సి సి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు*
*జమ్మికుంట ఇల్లందకుంట జులై 21 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లాలోని అపర భద్రాదిగా పెరిగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ మండల కాంగ్రెస్ నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ సీతారాముని ఆశీస్సులు మల్లికార్జున కార్గేపై ఉండాలని ఆయన ఆయురారోగ్యాలతో మరెన్నో పదవులు పొందాలని కోరుకున్నారు అనంతరం ఆలయ ముందు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశానుసారం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక ఎంపీగా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షునిగా తన ప్రయాణం సాగిందని కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని ప్రతిష్టాత్మకమైన హోదాలలో నియమించడం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడే పార్టీ అని తెలియజేస్తూ అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలు ప్రజలకు అందిస్తున్న పథకాలు అన్నీ కూడా పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాల ప్రజలకి లబ్ధి చెందే విధంగా ముందుకు వెళుతుందని యావత్ భారత దేశంలోనే కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో దళితులకు బహుజన వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళుతుందని పేర్కొన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజలకి రైతులకి విద్యార్థులకు, యువతకు ప్రతి ఒక్క పౌరునికి లబ్ధి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం హర్షనీయంగా పేర్కొంటూ భావితరాలకు కూడా ఇంకా మరెన్నో సేవలు చేసేలా నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగిందని మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ కి నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తూ రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో నాయకులుగా ఎదుగుతారని పేర్కొన్నారు ఈకార్యక్రమంలో గూడపు సారంగపాణి, ఎక్కటి సంజీవరెడ్డి, అన్నం ప్రవీణ్, మంకు అయిలయ్య, మోత్కూరి శ్రీనివాస్, మురహరి రాజు, దాంసాని తిరుపతి, మూడెత్తుల మల్లేష్, గురుకుంట్ల స్వామి, మ్యాడద తిరుపతి రెడ్డి, భోగం సాయి బొమ్మ శ్రీనివాస్, మారేపల్లి వంశీ, గూడెపు ఓదెలు, రాజబాబు, రెడ్డి సారంగం, పుట్ట రాజు ,ఎండి లాల్ మొహమ్మద్, గడ్డి శ్రీనివాస్, మోటపోతుల స్వామి, ఆరే రమేష్ రెడ్డి ,మూడెడ్ల రమేష్ ,తోడేటి కిషన్, బిజిగిరి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.