బిజెపి ఆధ్వర్యంలో జరిగే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి

బిజెపి
Headlines in Telugu
  1. బిజెపి ఆధ్వర్యంలో 3 డిసెంబరుకు బైక్ ర్యాలీ: ఆకుల రాజేందర్ పిలుపు
  2. జమ్మికుంట బైక్ ర్యాలీ: పేదలకు న్యాయం చేయాలని ఆకుల రాజేందర్
  3. తెలంగాణలో బిజెపి బైక్ ర్యాలీ: రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు
  4. బిజెపి బైక్ ర్యాలీ: పోరాటం ఆగదు! జమ్మికుంటలో భారీ జమావై
  5. జమ్మికుంట బైక్ ర్యాలీకి భారీ హాజరు: బిజెపి కార్యకర్తలు విజయవంతం చేయాలి

*మండల ఇన్చార్జ్ ఆకుల రాజేందర్*

జమ్మికుంట డిసెంబర్1 ప్రశ్న ఆయుధం::-

డిసెంబర్ నెల 3న ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని సభ్యత జమ్మికుంట మండల ఇన్చార్జ్ ఆకుల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని పేదలకు న్యాయం జరిగేదాకా బిజెపి పోరాటం ఆగదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాక్షస పాలన కొనసాగుతుందని, పేద ప్రజలకు న్యాయం చేసే ఏ ఒక్క పని చేయకుండా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అమలు చేయకుండా, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో1 బైక్ ర్యాలీ, బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల మూడవ తారీకు ఉదయం వీణవంక మండలం మామిడాలపెల్లి గ్రామం నుండి జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి, మాచనపల్లి, కోరపెల్లి, బిజిగిరిషరీఫ్, నాగంపేట నుండి ఇల్లందకుంట మండలంలోకి ప్రవేశిస్తుందని ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు,కార్యకర్తలు ఈ బైక్ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సభ్యత జమ్మికుంట మండల ఇంచార్జ్ ఆకుల రాజేందర్, మాజీ జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, మండల ప్రధాన కార్యదర్శి పుల్లూరు ఈశ్వర్, ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు రమేష్ యాదవ్, శక్తి కేంద్ర ఇన్చార్జ్ గాజుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now