Site icon PRASHNA AYUDHAM

సన్న బియ్యం పంపిణీ చేయలేని బీజేపీ నాయకులకు విమర్శలు చేసే అర్హత లేదు: గాదె శివచౌదరి

IMG 20250618 WA0297

సన్న బియ్యం పంపిణీ చేయలేని బీజేపీ నాయకులకు విమర్శలు చేసే అర్హత లేదు:

గాదె శివచౌదరి

 

ప్రశ్న ఆయుధం జూన్ 18: కూకట్‌పల్లి ప్రతినిధి

తెలంగాణ ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకే తిరిగి ఇవ్వడం తెలిసిందేనని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలుసుకోవాలని కూకట్‌పల్లి యువ కాంగ్రెస్ నాయకుడు గాదె శివచౌదరి సూచించారు.

తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించడం లేదని, ఆ విషయాన్ని పార్లమెంటులో బండి సంజయ్ ప్రశ్నించాలని కోరారు. మీరు తెలంగాణలో సున్న బియ్యం పథకం కేంద్ర సహాయంతోనో లేదో ప్రశ్నించకండి. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదు. ఇది బీజేపీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కాదా? అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి అద్వర్యం కాంగ్రెస్ సర్కారు సన్న బియ్యం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఇది పేదలపై గల ప్రేమను, సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతను చూపించే ఉదాహరణ. బీజేపీ నాయకులు ఇలాంటి ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోలేకపోతే, కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం అనవసరం అన్నారు.మీరు మేమే పంచుతున్నాం అని చెప్పడమే కాదు.. నిజంగా పంచగల గుణం ఉండాలి. మాటలు కాదు.. చేతల్లో విశ్వాసం ఉండాలి అంటూ బీజేపీపై శివ చౌదరి విమర్శలు గుప్పించారు.

Exit mobile version