మెదక్/నర్సాపూర్, మే 7 (ప్రశ్న ఆయుధం న్యూస్):కౌడిపల్లి మండల వ్యాప్తంగా అక్రమంగా నివాసముంటున్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులను వెంటనే తిరిగి వారి దేశాలకు పంపించాలని బుధవారం కౌడిపల్లి పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకులు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ రాజేందర్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్య అశోక్, మండల ప్రధాన కార్యదర్శి దుంపల లక్ష్మణ్, వనమాల రాజు, దేవులపల్లి కిష్టయ్య, ప్రవీణ్, రాజు, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు బాల్ లింగం యాదవ్, బూరుగడ్డ మాజీ ఉప సర్పంచ్ శేకులు యాదవ్, నాయకులు కొండల్, కర్రోల ముకేష్, కర్రోల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
కౌడిపల్లిలో అధికారులకు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు
Published On: May 8, 2025 8:29 am