*తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది:* *బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి*

*జహీరాబాద్ కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ మంజూరు చేయడంపై హర్షం*

*కేంద్ర నిర్ణయంతో వేల కోట్ల పెట్టబడులు*

*స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, కేంద్ర నిర్ణయంతో వేల కోట్ల పెట్టబడులు వస్తాయని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ మంజూరు చేయడ పట్ల గోదావరి అంజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మన ప్రాంతానికి రావడం వరమని ఆమె అభివర్ణించారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించిన 12 స్మార్ట్ సిటీల్లో జహీరాబాద్ స్థానం కల్పిచడం సంతోషకరమని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని ఆమె స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లో భాగంగా స్మార్ట్ సిటీకి కేంద్రం ఆమోదం తెలిపారని తెలిపారు. దీని ద్వారా రానున్న కాలంలో సుమారు 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని, తద్వారా జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆమె వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. అటో మొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్-మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. సుమారు 3 వేల ఎకరాల్లో రూ. 2,500 కోట్ల వ్యయంతో స్మార్ట్ సిటీ ఏర్పాటు అవుతుందని, తద్వారా రెండు లక్షలకు పైగా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నారు. తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేయనుందని గోదావరి అంజిరెడ్డి తెలిపారు. ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు గానూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్, కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సారెడ్డి, సంగారెడ్డి కౌన్సిలర్ మందుల నాగరాజు, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now