Site icon PRASHNA AYUDHAM

రామంతపూర్,వనస్థలిపురం లో రక్తదాన శిబిరాలు విజయవంతం.

IMG 20250625 WA0343

రామంతపూర్,వనస్థలిపురం లో రక్తదాన శిబిరాలు విజయవంతం.

– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

( ప్రశ్న ఆయుధం) జూన్ 25

 

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ 12వ వార్షికోత్సవం, సందర్భంగా రామంతాపూర్, వనస్థలిపురంలో ఏర్పాటుచేసిన రక్తదాన, శిబిరానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సంబు పాండయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజనీకాంత్, లను అభినందించడం జరిగిందన్నారు.33 రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన తనకు తలసేమియా పురస్కారాన్నీ అందజేయడం జరిగిందన్నారు. రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను మెమొంటోలను చేసామన్నారు. జూలై 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాల నిర్వహించి 3 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేనియా చిన్నారులకు అందజేస్తామని అన్నారు.ఇప్పటివరకు 3500 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసుకోవడం జరిగిందని,దేశంలోనే ఈ ఘనతను సాధించిన ఏకైక సంస్థలుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆవిర్భవించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కట్ట రవికుమార్, ప్రధాన కార్యదర్శి పబ్బశేఖర్,మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రమేష్, కోశాధికారులు బోనగిరి శ్రవణ్ కుమార్,ఊరే నాగేష్ కుమార్, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ బోనగిరి శ్రీనివాస్,కోలా వెంకటేష్,పల్లెర్ల బిక్షపతి,గట్టు ప్రకాష్,విశ్వనాధుల మంజునాథ్,దారం వెంకటేష్,బచ్చు శ్రీనివాస్,గ్రానైట్ బాలక్షన్,ధనరాజ్ సుజాత,జయమ్మ,లావణ్యలు పాల్గొన్నారు.

Exit mobile version